టార్గెట్‌ ఫిక్స్‌..నేను పార్టీ పెడుతున్నా..ఏపీలో గెలిచేది మళ్లీ జగనే : హీరో విశాల్

టార్గెట్‌ ఫిక్స్‌..నేను పార్టీ పెడుతున్నా..ఏపీలో గెలిచేది మళ్లీ జగనే : హీరో విశాల్

హీరో విశాల్ (Vishal) తెలుగు కుర్రాడైనప్పటికీ కోలీవుడ్ లో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. తాను చేసిన సినిమాలు, తెలుగు తమిళ భాషల్లో రిలీజై బాక్సాఫీస్ వద్ద విజయాల్ని సొంతం చేసుకున్నాయి. గుర్తింపు,హోదా కోసం కాకుండా ప్రజలకు ఇచ్చిన మాట కోసం పరితపిస్తుంటాడు. తనకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో  దేవి ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకుంటూ విద్యార్థులను చదవిస్తూ..రైతులకు సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 

తాజాగా విశాల్ తమిళనాడులో కొత్త పార్టీని స్థాపించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.నిజానికి కోపం, కసితో ఈ నిర్ణయం తీసుకుని త్వరలో పొలిటికల్ పార్టీ పెడతున్నాని అన్నారు. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు మారాలి. ఇంకా ఎక్కడా చూసిన ప్రజలు మంచి నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి రావడంపై అసహనం వ్యక్తం  చేసాడు.

ఇందుకోసం ఎన్జీవోలు ఎన్ని చేసినా..గ్రీన్ కలర్ సిగ్నేచర్ వాల్యూ వేరే. ఒక్కమాటలో చెప్పాలంటే అధికారంలో ఉండి చేస్తేనే సమాజం మారుతుంది. అంతేందుకు ఇదే కోపం కసితో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు కదా అని ప్రశ్నించగా..విశాల్ ఆసక్తికర వ్యాక్యలు చేసాడు. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి..కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా..రాజకీయాల్లోకి వచ్చి చాలా కష్టపడుతున్నాడు. ఏదేమైనా ఏపిలో మళ్లీ గెలిచేది మాత్రం జగనే సీఎం అవుతారని విశాల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

అయితే, తాను కుప్పం నుంచి పోటీ చేస్తున్నాడంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు.అది ఒక రూమర్ మాత్రమే అని కొట్టిపాడేసాడు.ఇక గత ఎన్నికలలలో సీఎం జగనే అని ముందుగా చెప్పానని..ఈసారి కూడా సీఎం జగనే వస్తాడంటున్న విశాల్ తెలిపారు. 

ఇదే సమయంలో మరో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా..? అని ప్రశ్నించగా..అందుకు ఆయన నో  అని చెప్పారు. ముందుగా ప్రజల్లో తాను ఏంటో నిరూపించుకోవాలని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికల పొత్తు గురించి ఆలోచిస్తానని అన్నారు. 

ప్రస్తుతం విశాల్..‘సింగం’ ఫేమ్ హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రత్నం మూవీలో నటిస్తున్నాడు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఏ  మూవీ ఏప్రిల్ 26న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.