
మంచు విష్ణు నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’. ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజై సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఈ క్రమంలో కన్నప్ప ఓటీటీ డీల్పై ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ రోజుల్లో, థియేటర్లలో సినిమాల విడుదల తేదీలను, నిర్ణయించడంలో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటిది, కన్నప్ప రిలీజ్కు దగ్గరపడిన, ఇప్పటివరకు ఓటీటీ డీల్ సెట్ అవ్వలేదు.
ఈ మూవీ కోసం రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పోటీలో ఉన్నాయని సమాచారం. ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఈ రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్.. కన్నప్ప డిజిటల్ హక్కుల కోసం భారీ రేట్ చెల్లించేందుకు సిద్దమయ్యాయట. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో.. విష్ణు పలు కండీషన్లు పెట్టారని సినీ వర్గాల టాక్. విష్ణు పెట్టిన కండిషన్స్తో.. ఈ ఓటీటీలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
అందులో మొదటి నిబంధన ప్రకారం.. కన్నప్ప బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే, 8 వారాల థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలనీ మంచు విష్ణు అన్నారట.
రెండో నిబంధన ప్రకారం.. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం.. రెగ్యులర్గా OTT టైం ప్రకారం.. 'అంటే రిలీజైన 4 వారాల్లో డిజిటల్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చని' విష్ణు ఈ కండిషన్స్ ముందుంచారట. అయితే, ఇప్పుడీ ప్లాట్ఫామ్స్ విష్ణు పెట్టిన రెండు కండిషన్స్కు ఒకే చెప్పినట్టు కూడా మరో టాక్ వినిపిస్తోంది.
అయితే, ఈ సినిమా 8 వారాల తర్వాత OTTలో వస్తే.. స్ట్రీమింగ్ హక్కుల నుండి తన పెట్టుబడిని విష్ణు తిరిగి పొందగలడని దీని అర్థం. ఇలా.. విష్ణు తన పెట్టుబడిలో ఎక్కువ భాగాన్ని పోస్ట్-థియేట్రికల్ హక్కుల ద్వారా తిరిగి పొందేలా వ్యూహం రచించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అవా ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఈ మూవీని రూ.200 కోట్ల బడ్జెట్ తో మంచు మోహన్ బాబు గ్రాండ్ గా నిర్మించారు. ఇందులో విష్ణు, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, మోహన్ లాల్ వంటి స్టార్ యాక్టర్స్ నటించడం విశేషం.