
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2023 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15 వరకు విశ్వహిందూ పరిషత్ .. శౌర్య యాత్రను నిర్వహించనుంది. వీహెచ్పీ 60వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణలో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. బజరంగ్ దళ్ అధినేత నీరజ్ డొనేరియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
దీనిపై వీహెచ్పీ మీడియా ఇన్చార్జి బాలస్వామి మాట్లాడుతూ.. 1964లో కృష్ణాష్టమి రోజున విశ్వహిందూ పరిషత్ను స్థాపించారు. అప్పటి నుంచి ఆరు దశాబ్దాలుగా తిరుగులేని విజయంతో ముందుకు సాగుతోంది. దాని ఉనికిలో 59 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ఇది దాని 60వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా శౌర్య యాత్రను నిర్వహించతున్నామని తెలిపారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు తెలంగాణ అంతటా ఈ యాత్ర సాగుతుందని వెల్లడించారు.