ఒక్కో ఎకరానికి 20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి: వివేక్ వెంకటస్వామి

ఒక్కో ఎకరానికి 20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి: వివేక్ వెంకటస్వామి

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని  బీజేపీ జాతీయ కార్యవర్గ  సభ్యులు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.  ప్రతి రైతుకు ఒక్కో ఎకరానికి 20 వేల చొప్పున  నష్టపరిహారం చెల్లించాలన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని నాగెపెల్లి గ్రామంలో ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రంలో ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని మే 10న పరిశీలించారు.  రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం పరిస్థితి  గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు  ఫసల్  బీమా పథకం క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వరంగల్ ,జనగామ జిల్లాల్లోనూ పర్యటన

ఇవాళ ఉదయం( మే 10)  వరంగల్, జనగామా జిల్లాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా వర్ధన్నపేట మండలం ఇల్లందులోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం, కొనుగోలు కేంద్రాలలో ఎదుర్కొంటున్న  రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వివేక్ వెంటస్వామి.. రాష్ట్రంలో పంటలు నష్టపోయి రైతులు ఏడుస్తుంటే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బీఆర్ఎస్ జల్సా చేస్తుందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద 5 నుంచి 7 కిలో వరకు తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నరని వివేక్ వెంటస్వామి ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయలేదు.. ఎరువులు ఇవ్వలేదు..పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదని మండిపడ్డారాయన. రాష్ట్రంలో ఫసల్ భీమా అమలు చేయకపోవడం వల్లే రైతులకు పరిహారం అందక నష్ట పోతున్నారని తెలిపారు. రైతులను కోటీశ్వరులు చేస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులను అగం చేస్తోందని ధ్వజమెత్తారు వివేక్