వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి

వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూసుకుపల్లిలో నీట మునిగిన పంట పొలాలను, ఇళ్లను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతిపై ఆరా తీశారు. తమ దగ్గరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరు రాలేదని.. పంటలు, ఇళ్లు నీట మునిగి సర్వం కోల్పోయామంటూ వివేక్ తో బాధిత మహిళలు గోడు వెల్లబోసుకున్నారు. దీనిపై ఫోన్లో ఆర్డీవోతో మాట్లాడిన ఆయన..నష్టపోయినా వారికి వెంటనే ఆర్థిక సాయం అందచేయాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారిని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.