బాలానందం కుటుంబానికి వివేక్ వెంకటస్వామి పరామర్శ

బాలానందం కుటుంబానికి వివేక్ వెంకటస్వామి పరామర్శ

జాతీయ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బాలానందం మృతి దళిత సమాజానికి పెద్ద లోటన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. మాలల హక్కులు, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. కోఠిలో బాలానందం భౌతికకాయానికి నివాళులర్పించారు వివేక్ వెంకటస్వామి. కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలానందం ఆశయాలను ఆయన కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

బాలానందం భౌతికకాయానికి నివాళులర్పించారు పలువురు నేతలు. కోఠిలోని ఆయన నివాసంలో శ్రధ్ధాంజలి ఘటించారు. దళితుల అభివృద్ధికి బాలానందం ఎంతో కృషి చేశారని తెలిపారు  BSP స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి వినోద్. బాలానందం భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాలల హక్కుల కోసం బాలానందం పోరాటం చేశారని తెలిపారు.

బాలానందం జీవితం మొత్తం దళితులకు అంకితం చేశారన్నారు ఎమ్మెల్సీ ప్రభాకర్. బాలానందం మృతి బాధాకరమన్నారు అద్దంకి దాయాకర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి.