నేనంటే గిట్టనోళ్లే తప్పుడు ప్రచారం చేస్తున్రు: వివేక్ వెంకటస్వామి

నేనంటే గిట్టనోళ్లే తప్పుడు ప్రచారం చేస్తున్రు: వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ చెంచాగాళ్లు కొందరు తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసి కేసీఆర్‭ను గద్దె దించాలన్నదే తన లక్ష్యమని ఆయన చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ, మునుగోడు ఎలక్షన్లలో టీఆర్ఎస్‭కు గట్టి బుద్ది చెప్పామన్నారు. తన పేరును బద్నాం చేయడానికే కొందరు గిట్టనోళ్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అభివృద్ధి గురించి మాట్లాడకుండా.. కేవలం మోడీని తిట్టడమే పనిగా కేసీఆర్ ప్రసంగించారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.  

 

ప్రజలను మభ్య పెట్టడానికే కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకువచ్చారని కేసీఆర్ పై వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. తాను ఇంజనీర్ నని చెప్పుకుంటూ.. తప్పుడు డిజైన్ చేసి ప్రజలపై లక్షా 25వేల కోట్ల భారం మోపారని ఆయన ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో కంటే పెట్రోల్, డీజిల్ పై రూ.10 ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు దోచుకున్నది సరిపోక.. బీఆర్ఎస్ పార్టీ పేరుతో దేశాన్ని దోచుకుందామని చూస్తున్నాడని కేసీఆర్ పై వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు.