ఎట్లున్నరు ఫ్రెండ్స్​?.. కార్యకర్తలకు వివేక్ వెంకటస్వామి ఆత్మీయ పలకరింపు

ఎట్లున్నరు ఫ్రెండ్స్​?..  కార్యకర్తలకు వివేక్ వెంకటస్వామి ఆత్మీయ పలకరింపు

హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని బీజేపీ కార్యకర్తలను ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆత్మీయంగా పలకరించారు. గురువారం ఆయన భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు వెళ్తూ హుస్నాబాద్ లో కొద్దిసేపు ఆగారు. ఆయన వస్తున్న విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తాలో స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్, హుస్నాబాద్ మండల అధ్యక్షుడు చక్కబండి విద్యాసాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, నాయకులు కోమటి సత్యనారాయణ, అక్కు శ్రీనివాస్ తదితరులు వివేక్ వెంకటస్వామిని శాలువాలతో సన్మానించారు.

  ‘‘చాలా రోజులైంది.. హుస్నాబాద్ కు ఎప్పుడో వచ్చాను.. ఎలా ఉన్నారు అందరూ...’’ అని వివేక్​ వారిని పలకరించారు. దివంగత నేత కాకా  కృషితోనే హుస్నాబాద్ అభివృద్ధి చెందిందని కార్యకర్తలు వివేక్ తో చెప్పారు. బస్​ డిపోతోపాటు ప్రభుత్వ ఆఫీసులు, పేదలకు ఇండ్ల స్థలాలు కాకా తెచ్చినవే అని తెలిపారు. హుస్నాబాద్​కు మళ్లొకసారి వస్తానని, అప్పుడు అన్ని మాట్లాడుకుందామని కార్యకర్తలతో చెప్పి  వివేక్​ ముల్కనూరుకు బయలుదేరారు.