కరీంనగర్ టౌన్, వెలుగు: టెన్త్ ఫలితాల్లో సిటీలోని వివేకానంద విద్యానికేతన్ విద్యార్జులు ఆర్.కీర్తి ప్రియ576, కె. సాత్విక567, కె. నిహారిక565, కె. శ్రీనిధి561 మార్కులు సాధించడంతో పాటు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని చైర్మన్ సౌగాని కొమురయ్య తెలిపారు. ఐదేండ్లుగా అత్యున్నత స్థాయి మార్కులతో పాటు 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నట్లు తెలిపారు.
చక్కని విద్యా ప్రణాళిక, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో ప్రత్యేక తరగతులు, ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక దృష్టి సారించడంతోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ప్రిన్సిపాల్ మిథున్ జే. మిస్త్రి, వైస్ ప్రిన్సిపాల్ సాగర్ సర్కార్, ఏవో తుంగాని సంపత్, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
