
అమెరికాలోని ఓ సరస్సులో విశాఖ యువకుడు గల్లంతైన ఘటన అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ కు చెందిన ఎ.వెంకటరావు కుమారుడు అవినాశ్ ఉన్నత చదువుల కోసం ఐదేళ్ల కిందట అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన అవినాష్ రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ సరస్సులో బోటు షికారుకు వెళ్లి ప్రమాదవశాత్తు సరస్సులో పడి మృతి చెందాడు. సరస్సు లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో అవినాశ్ గల్లంతయ్యాడు. దీంతో అవినాష్ స్నేహితులు అతని కుటుంబసభ్యులకు సమాచారమందించారు.