ఎయిర్ పోర్ట్ భూముల్లో పంటలు వేయొద్దని రైతులకు నోటీసులు

ఎయిర్ పోర్ట్  భూముల్లో పంటలు వేయొద్దని రైతులకు నోటీసులు

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​ నిర్మించనున్న భూముల్లో పంటలు వేయొద్దని జిల్లా అధికారులు రైతులకు నోటీసులు పంపించారు. సెక్షన్‍ 11 (1) ప్రకారం ప్రాథమిక ప్రకటన (పీఎన్‍), డిక్లరేషన్‍ ప్రతిపాదనలను కలెక్టర్‍ ఆమోదించిన నేపథ్యంలో ఈ భూముల్లో పంటలు వేయొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. కలెక్టర్‍ ఉత్తర్వులుగా వరంగల్‍ ఆర్డీవో పేరుతో శుక్ర, శనివారాల్లో ఇక్కడి రైతులకు వీటిని పంపించడంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. 

పరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తిచేయకుండా కొందరు రైతులతో హడావుడిగా  సంతకాలు చేపించి, పంటల సాగును ఆపమని నోటీసులు ఇవ్వడం సరికాదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.