ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అంటే ఇట్లుంటదా .. ఆగ్రహం వ్యక్తం చేసిన  వరంగల్ కలెక్టర్

ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అంటే ఇట్లుంటదా .. ఆగ్రహం వ్యక్తం చేసిన  వరంగల్ కలెక్టర్

వరంగల్​ సిటీ/ నల్లబెల్లి, వెలుగు: ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అంటే ఇట్లుంటదా అంటూ వరంగల్​ కలెక్టర్​ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె వరంగల్​ సీకేఎం ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ సేవలపై పేషెంట్లు, డాక్టర్ల వద్ద ఆరా తీశారు. భోజన మెనూ పాటించకపోవడంపై సీరియస్​ అయ్యారు. బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. పలు రికార్డులను పరిశీలించారు. అన్నపూర్ణ క్యాంటీన్​ను బయటకు మార్చాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. 

అంతకుముందు వరంగల్​జిల్లా నల్లబెల్లి మండలం కన్నారావుపేట, నందిగామ గ్రామాల్లో నిర్వహిస్తున్న భూ భారతి సదస్సులను కలెక్టర్​ సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి విద్యార్థుల నమోదు శాతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో డీఈవో జ్ఞానేశ్వర్, ఇతర అధికారులతో కలిసి​పాల్గొన్నారు.