చెక్​పోస్టుల వద్ద నిరంతరం పహారా ఉండాలి : అంబర్​ కిశోర్​ ఝా

చెక్​పోస్టుల వద్ద నిరంతరం పహారా ఉండాలి : అంబర్​ కిశోర్​ ఝా

జనగామ అర్బన్, వెలుగు :  పార్లమెంట్​ ఎన్నికల సంరద్భంగా ఏర్పాటు చేసిన జనగామ పోలీస్​ స్టేషన్​  పరిధిలో   చేసిన చెక్​పోస్టును వరంగల్​ పోలీస్​ కమిషనర్ అంబర్​ కిశోర్​ ఝా గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా సీపీ చెక్​ పోస్ట్ అధికారులు, భద్రతా సిబ్బందితో మాట్లాడుతూ పార్లమెంట్​ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్​పోస్టులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.  

జిల్లాలోని చెక్​ పోస్టులలో సిబ్బంది నిరంతరం అలర్ట్​గా ఉండాలన్నారు.  అనంతరం  తనిఖీలు చేసిన వాహన నమోదు రిజిస్టర్​ ను పరిశీలించారు.  జనగామ సీఐ రఘుపతి రెడ్డి, ఎస్సై సృజన్​ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.