వరంగల్, వెలుగు: విధి నిర్వహణలో రాణించే సిబ్బందికి శాఖా పరంగా గుర్తింపుతోపాటు రివార్డులు వస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. సోమవారం కమిషనరేట్ ఆఫీస్లో పోలీస్ సిబ్బంది శాఖ పరమైన సమస్యలపై పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమంలో సీపీ సిబ్బందితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిజాయితో పనిచేయాలన్నారు. ఏదైనా శాఖా పరమైన, వ్యక్తిగత సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
