కామారెడ్డి జిల్లాలో జర్నలిస్టు దత్తురెడ్డి హఠాన్మరణం

కామారెడ్డి జిల్లాలో జర్నలిస్టు దత్తురెడ్డి హఠాన్మరణం

హనుమకొండ సిటీ, వెలుగు: ఓ దినపత్రికలో వరంగల్ జిల్లా స్టాప్ రిపోర్టర్ గా పని చేస్తున్న జీడిపల్లి దత్తురెడ్డి (37) గుండెపోటుతో సోమవారం రాత్రి మృతిచెందారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మద్దెల చెరువుకి చెందిన దత్తురెడ్డి 2015 నుంచి హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో స్టాప్ రిపోర్టర్ గా పనిచేసి, గతేడాదిలో వరంగల్ జిల్లా స్టాప్ రిపోర్టర్ గా వచ్చారు. హనుమకొండలోని తన ఇంట్లో సోమవారం ఛాతిలో నొప్పి రావడంతో 108 లో ఎంజీఎంకు తరలించగా, డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. 

దత్తురెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి సంతాపం ప్రకటించారు. టీయూడబ్ల్యూజే 143 నాయకులు హనుమకొండ ప్రెస్ క్లబ్ లో దత్తురెడ్డికి నివాళులర్పించారు.