
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ అర్బన్ కో - ఆపరేటివ్బ్యాంక్ సేవలు వృద్ధి చెందుతున్నాయని అర్బన్ బ్యాంక్ చైర్మన్ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. ఆదివారం సిటీలోని కేఆర్గార్డెన్స్లో వరంగల్ అర్బన్ బ్యాంక్29వ మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 14.24శాతం వృద్ధితోపాటు డిపాజిట్లు రూ.2.19.20 కోట్లకు చేరిందన్నారు. రుణాల మంజూరులో 13.20 శాతం వృద్ధిలో రూ.154.13 కోట్లకు చేరడంతో బిజినెస్ రూ.373.43 కోట్లకు చేరినట్లు తెలిపారు.
డిపాజిట్దారులకు రిజర్వు బ్యాంక్నిబంధనల మేరకు డీఐసీజీసీ ద్వారా రూ.5లక్షల వరకు ఇన్సూరెన్స్సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల్, చంద్రమౌలి, సంపత్ కుమార్, మహ్మద్గౌసుద్దీన్, పవన్కుమార్, పాపి రెడ్డి, హరినాథ్, రవికుమార్, భార్గవి, స్వప్న, ఖాతారులు తదితరులున్నారు.