హైదరాబాద్సిటీ, వెలుగు: హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్పరివాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ జంట జలాశయాల్లోకి వరద ప్రవాహం పెరిగింది. హిమాయత్సాగర్లోకి 400 క్యూసెక్కుల వరద చేరి, నీటిమట్టం పెరుగుతోంది.
అవసరమైతే గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని వివిధ ప్రభుత్వ శాఖలు, విపత్తు నిర్వహణ విభాగాలు, జలాశయాల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాటర్బోర్డు సూచించింది.
హిమాయత్సాగర్పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,761.15 అడుగులకు చేరింది. ఉస్మాన్సాగర్పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1784.35 అడుగులకు చేరింది.
