
హైదరాబాద్సిటీ, వెలుగు:జంట నగరాల తాగునీటి అవసరాలు తీరుస్తున్న మెట్రోవాటర్బోర్డు ఇక నుంచి తన పరిధిని మరింత విస్తరించుకునేందుకు సిద్ధమవుతోంది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ట్రిపుల్ఆర్ వరకూ వాటర్బోర్డు విస్తరించనుంది. ఇందుకోసం అధికారులు యాక్షన్ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాలతోపాటు ఔటర్ రింగ్ రోడ్లోని మరికొన్ని గ్రామాలకు రోజుకు 550 ఎంజీడీ నీటిని వాటర్ బోర్టు సరఫరా చేస్తున్నది.
త్వరలో గోదావరి రెండు, మూడో దశ పనులు పూర్తయితే మరింత నీటి లభ్యత ఏర్పడనుంది. రోజుకు 160 ఎంజీడీల నీరు అదనంగా అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ట్రిపుల్ఆర్వరకూ ఉన్న గ్రామాల వరకూ తాగునీటిని సరఫరా చేసేలా వాటర్బోర్డు పరిధిని విస్తరించనున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్వరకూ ఉన్న ప్రాంతాలను అర్బన్కోర్ఏరియాగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండడంతో రియల్ఎస్టేట్ కూడాపుంజుకుంటోంది.
ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు కూడా పెరుగుతున్నాయి. వాటర్బోర్డు పరిధి పెరగడం వల్ల ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు చేసుకునే వారికి అవసరమైనతం నీటిని కూడా అందించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాటర్బోర్డు పరిధి 1450 చ. కి.మీ. కాగా, కొత్తగా ట్రిపుల్ఆర్వరకూ విస్తరిస్తే మరో 2500 చ.కి.మీ. వరకూ పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. దీంతో ప్రస్తుతం ఆయా ప్రాంతాలు బోర్డు పరిధిలోకి వస్తే రోజుకు 750 ఎంజీడీల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు.