హైదరాబాద్సిటీ, వెలుగు: నల్లాలకు మోటార్లను బిగించి నీటిని తోడేస్తున్న వారి పని పడుతోంది వాటర్బోర్డు. మంగళవారం విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో కొండాపూర్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీ, ప్రశాంత్ నగర్ ప్రాంతాల్లో తనిఖీలు చేసి నల్లాలకు బిగించిన 22 మోటార్లను స్వాధీనం చేసుకుంది. తక్కువ ప్రెషర్తో నీళ్లు వచ్చినా, సరఫరాలో సమస్యలు తలెత్తినా 155313 నంబర్కు ఫోన్ చేయాలన్నారు.
