ఢిల్లీని వేధిస్తున్న నీటి సమస్య

ఢిల్లీని వేధిస్తున్న నీటి సమస్య

ఈశాన్య ఢిల్లీని నీటి సమస్య వేధిస్తోంది. గత వారం రోజులుగా అల్లర్లు, హింసాకాండతో ఈశాన్య ఢిల్లీలోని అనేక ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. పవర్ సప్లై కూడా లేదు. ఇప్పుడిప్పుడే పవర్ సప్లై రిస్టోర్ చేస్తున్నారు అధికారులు. అయితే నీటి సమస్య మాత్రం తీవ్రమవుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నా… అవి ఏమాత్రం సరిపోవడంలేదు. నీటికోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.