మాకు నితీశ్ అవసరం లేదు..మా పని మేం చేస్తం: రాహుల్

మాకు నితీశ్ అవసరం లేదు..మా పని మేం చేస్తం: రాహుల్

ఇండియా కూటమి నుంచి బీహార్ సీఎం నితీశ్ కుమార్  వైదొలగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. తమకు నితీశ్ కుమార్ అవసరం లేదని.. తమ పని తాము చేస్తామన్నారు. 

భారత్  జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బీహార్ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఈ దేశంలో కులగణన చేయాల్సిన అవసరముంది.   బీహార్‌లో సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమిదే.. ఇక్కడ నితీష్‌ కుమార్‌ అవసరం లేదు.. ఇక్కడ మా పని మేం చేస్తాం..అని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఇటీవల ఇండియా కూటమి నుంచి వైదొలిగిన నితీశ్ కుమార్ బీజేపీతో జతకట్టి బీహార్ లో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. నితీష్ కుమార్ తో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.