మహిళలకు ఆ స్కీం ఇచ్చి పెద్ద తప్పు చేశాం.. ప్రభుత్వం ఇచ్చిన ఓటుకు నోటు స్కీం అంటున్న ప్రతిపక్షం

మహిళలకు ఆ స్కీం ఇచ్చి పెద్ద తప్పు చేశాం.. ప్రభుత్వం ఇచ్చిన ఓటుకు నోటు స్కీం అంటున్న ప్రతిపక్షం

ఎలక్షన్ల ముందు ఇబ్బడిముబ్డిగా  అమలు చేసిన పథకాలపై డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఓ స్కీం లో అప్లై చేసుకున్న వాళ్లందరికీ వర్తింపజేయడం తాము చేసిన తప్పుగా చెప్పడం మహిళలకు ఆగ్రహం తెప్పించింది. ప్రతిక్షాలు కూడా ఈ ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నాయి. 

గత ఎన్నికల సందర్భంగా ‘ముఖ్యమంత్రి మఝీ లడికీ బహిన్ యోజన’ పథకం అప్లై చేసుకున్న వారందరికీ ఇచ్చి తప్పు చేశామని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఓ సభలో నోరు జారారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్లికేషన్లను విచారించే సమయం లేకపోవడంతో అప్లై చేసుకున్న వాళ్లందరికీ ఇచ్చినట్లు చెప్పారు. రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు అనౌన్స్ చేస్తారనగా ఈ స్కీమ్ ను అమలు చేసినట్లు చెప్పారు. 

లడ్కీ బహిషన్ పథకం 2024 ఆగస్టులో ప్రారంభించారు. ఈ పథకం కింద 21 ఏండ్ల నుంచి 65 ఏండ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తారు. ఆదాయం 2.5 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉన్న మహిలలకు ఈ పథకం వర్తిస్తుంది. పేద మహిళలకోసం స్కీం తెచ్చినప్పటికీ.. అప్లై చేసుకున్నవారందరికీ ఇవ్వాల్సి వచ్చిందని మంత్రి అన్నారు. 

డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) తీవ్రంగా మండిపడిది. ఎన్నికల కోసం తెచ్చిన స్కీం అది అని ఆ పార్టీ ఎంపీ సంజ్ రౌత్ అన్నారు. పబ్లిక్ ఫండ్స్ వృధా చేసినందుకు డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం ప్రభుత్వ సొమ్మును వృధా చేశారని... అది ఓటుకు నోటు స్కీమ్ అని విమర్శించారు. 

అయితే 2024 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపుకు ఈ స్కీమ్ లాభం కలిగించిందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఈ స్కీం వలన బారీగా కేటాయింపులు చేయాల్సి వస్తుండటంతో ప్రభుత్వంపై భారంగా మారింది. బడ్జెట్ సరిపోవటం లేదనే కారణంతో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఓట్ల కోసం ఈ స్కీం తెచ్చారని, ప్రజా ధనాన్ని వృధా చేశారని విమర్శిస్తున్నారు. అనర్హులకు, లక్షాధికారలకు కూడా స్కీం ఇవ్వడం వలన ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.