సమాజ పురోగతికి కృషి చెయ్యాలి: మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు

సమాజ పురోగతికి కృషి చెయ్యాలి: మహారాష్ట్ర మాజీ గవర్నర్  విద్యాసాగర్ రావు

ముషీరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే మన సంస్కృతి చాలా గొప్పదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ అన్నారు. అన్ని దేశాల వారిని గౌరవిస్తామని, కానీ చైనా మనపై కుతంత్రాలు ఆపడం లేదని విమర్శించారు. బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఐఏఎస్ టాపర్స్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.  

సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ..  సివిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిపేరయ్యే వారు, ఐఏఎస్​లుగా ఎంపికైనవారు దేశ భవిష్యత్, సమాజ పురోగతికి కృషి చేయాలని సూచించారు. 

అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ, బీపీ ఆచార్య, వీఎన్ విష్ణు, చక్రపాణి, చిరంజీవులు, ప్రొఫెసర్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.