వారి సహకారంతోనే అధికారంలోకి వస్తం: మాణిక్  రావు ఠాక్రే

వారి సహకారంతోనే అధికారంలోకి వస్తం: మాణిక్  రావు ఠాక్రే

సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఎప్పు డూ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం స్థానిక కాంగ్రెస్  ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ముస్లింలకు మిలాద్ గ్రౌండ్ లో ఇఫ్తార్  విందు ఇచ్చారు. ఈ విందుకు ఠాక్రేతో పాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీనియర్  నాయకులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కి, సురేశ్  షెట్కార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంఏ ఫయీమ్ హాజరయ్యారు.

ముస్లింల సహకారంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఇంతకాలం కాంగ్రెస్ కు వారు అండగా నిలబడుతూ వచ్చారని  ఠాక్రే పేర్కొన్నారు. ఎంపీ ఉత్తమ్  మాట్లాడుతూ.. రాహుల్ నుంచి ఇక్కడున్న లోకల్ లీడర్ల వరకు అందరూ ముస్లింలకు తోడుగా నిలిచామన్నారు. కాంగ్రెస్  పార్టీ ముస్లింల సంక్షేమం కోసం వారి పక్షాన కొట్లాడుతుందని తెలిపారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.