అక్రమ నిర్మాణాలను ఉపేక్షించబోం: చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించబోం: చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య

చేవెళ్ల, వెలుగు: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే ఊరుకోబోమని చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య హెచ్చరించారు. చేవెళ్ల మండలం నాంచేరి గ్రామ  పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్​ సర్వే నెంబర్ 56లో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన సుమారు 20 ఎకరాల స్థలాన్ని కొందరు స్థానికులు ఆక్రమించారు. అందులో ఇండ్లు నిర్మిస్తుండగా.. శుక్రవారం తహసీల్దార్ కృష్ణయ్య తమ సిబ్బంది, పోలీసులను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చారు. అక్రమ నిర్మాణాలను జేసీబీతో కూల్చివేయించారు.

ఐఎస్ సదన్లో ఆక్రమణల తొలగింపు..
మలక్ పేట: ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్ నుంచి కృష్ణానగర్ కాలనీ వరకు ఉన్న నాలా ఆక్రమణలను శుక్రవారం హైడ్రా  పరిశీలించింది. నాలా వరద ప్రవాహం 6 అడుగులు ఉండగా ఓ ఖాళీ స్థలం యజమాని 2 అడుగులే వదిలి ప్రహరీ నిర్మించారు. ఆ నిర్మాణాన్ని  హైడ్రా  అధికారులు కూల్చేశారు. హైడ్రా ఇన్​స్పెక్టర్ తిరుమలేశ్ పాల్గొన్నారు.