- హైదరాబాద్ వాతావరణశాఖ
హైదరాబాద్: ఉత్తర - దక్షిణ ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా స్థిరంగా కొనసాగుతోంది. నిన్న ఆగ్నేయ బంగాళా ఖతంలో ఉన్న ఆవర్తనం ఈ రోజు సగటు సముద్ర మట్టంకి 0.9కి మీ నుండి 3.1 కి మీ ఎత్తు మధ్య విస్తరించి కొనసాగుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ద్రోణి ప్రభావం రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈరోజు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం
ద్రోణి ప్రభావంతో ఈ రోజు,ఎల్లుండి తెలంగాణా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల మూడు రోజుల వరకు ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వివరించింది.