వివాహానికి హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్​వెంకటస్వామి

వివాహానికి హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్​వెంకటస్వామి

మహదేవపూర్, వెలుగు: మాల సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గోల్కొండ మల్లయ్య కూతురు వివాహం గురువారం మహదేవపూర్​మండలంలోని అంబటిపల్లి గ్రామంలో జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్​వెంకటస్వామి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​తోపాటు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.