హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్పార్టీ.. ఆ రెండు పార్టీలపై తాజాగా వ్యంగ్యాస్త్రాలను సంధించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లగ్గమాడుతున్నాయని బుధవారం ట్వీట్ చేసింది.
తెలంగాణ అమరుల ఆత్మఘోషతో, కేసీఆర్ఫామ్ హౌస్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటవుతున్నాయని విమర్శించింది. 'కవితపై కరుణ' అనే నక్షత్రంలో రెండు పార్టీల లగ్గం జరుగుతుందని ఎద్దేవా చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, అర్వింద్ ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకుంటున్నాయని ఆరోపించింది. బీఆర్ఎస్, బీజేపీల పెండ్లిలో ఏడడుగులను.. కాంగ్రెస్ పార్టీ ఏడు రకాలుగా వర్ణించింది.
ALS0 READ:అనారోగ్యం కారణంగానే సినిమాలకు దూరం