కేసీఆర్​ ఫామ్​హౌస్​లో బీఆర్ఎస్, బీజేపీ లగ్గం

కేసీఆర్​ ఫామ్​హౌస్​లో బీఆర్ఎస్, బీజేపీ లగ్గం

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్​పార్టీ.. ఆ రెండు పార్టీలపై తాజాగా వ్యంగ్యాస్త్రాలను సంధించింది. ఈ ఎన్నికల్లో  బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లగ్గమాడుతున్నాయని బుధవారం ట్వీట్ చేసింది. 

తెలంగాణ అమరుల ఆత్మఘోషతో,  కేసీఆర్​ఫామ్ హౌస్​లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటవుతున్నాయని విమర్శించింది. 'కవితపై కరుణ' అనే నక్షత్రంలో  రెండు పార్టీల లగ్గం జరుగుతుందని ఎద్దేవా చేసింది. 

ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావు, కవిత, కిషన్​ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, అర్వింద్ ల ఆధ్వర్యంలో  బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకుంటున్నాయని ఆరోపించింది. బీఆర్ఎస్, బీజేపీల పెండ్లిలో ఏడడుగులను.. కాంగ్రెస్​ పార్టీ  ఏడు రకాలుగా వర్ణించింది.

ALS0 READ:అనారోగ్యం కారణంగానే సినిమాలకు దూరం