ప్రజాస్వామ్య వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది: మమతా బెనర్జీ

ప్రజాస్వామ్య వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 

కోల్‌కతా: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ పాలన ఇలాగే సాగితే.. రాష్ట్రపతి పాలనకు దారి తీసే ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ‘‘ప్రజాస్వామ్యం, సమాఖ్య నిర్మాణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీపై ఉంది’’ సీజేఐ జస్టిస్ యూయూ లలిత్‌ను ఆమె కోరారు.

ఆదివారం కోల్‌కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎన్‌యూజేఎస్‌) కాన్వొకేషన్‌కు సీజేఐ జస్టిస్ లలిత్ వీసీగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం మమతా బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలను వేధింపుల నుంచి రక్షించాలని న్యాయవ్యవస్థను కోరారు. ప్రజాస్వామిక అధికారాన్ని స్వాధీనం చేసుకున్నదంటూ బీజేపీ సర్కార్ పై మండిపడ్డారు. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు. మీడియా కూడా పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు.