సీఎం మాటిచ్చి ఆరేళ్లాయే.. రాచకొండ ఫిల్మ్​సిటీ ముచ్చటేదీ!

సీఎం మాటిచ్చి ఆరేళ్లాయే.. రాచకొండ ఫిల్మ్​సిటీ ముచ్చటేదీ!

సీఎం మాటిచ్చి ఆరేళ్లవుతున్నా ముందుకు కదల్లే

సినీ ప్రముఖుల మీటింగ్​తో మళ్లీ తెరపైకి
వికారాబాద్ , యాదాద్రి ప్రాంతాలపైనా నజర్

హైదరాబాద్​, వెలుగు: ‘రాచకొండలో ఫిల్మ్​ సిటీ ఏర్పాటు చేస్తం’.. ఇదీ రాష్ట్రం వచ్చిన కొత్తలో సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ. అంతేకాదు.. 2014 డిసెంబర్​లో సీఎం ఏరియల్​​సర్వే కూడా చేశారు. అక్కడ ఉన్న 33 వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో ఫిల్మ్​ సిటీ కోసం 2 వేల ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ, ఆ తర్వాత దాని ఊసే లేదు. ఈ ఆరేళ్లలో ఆ విషయం ప్రస్తావనే రాలేదు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్​తో చిరంజీవి, నాగార్జున భేటీ సందర్భంగా మళ్లీ ఫిల్మ్​ సిటీ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. అయితే, ఈసారైనా అది అమలవుతుందా లేదా అన్న దానిపై ప్రభుత్వ వర్గాలే వేర్వేరు అభిప్రాయాలు చెప్తున్నాయి. కేవలం మాట వరుసకే అన్నారని కొందరంటుంటే.. ఈసారి అమలు చేస్తారని మరి కొందరు చెబుతున్నారు.

ప్లేస్​ చేంజ్​ చేస్తరా?

ఫిల్మ్​ సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ అయితే ఇచ్చారు గానీ.. ఎక్కడ అన్న దానిపైనే ఇప్పుడు మరిన్ని వాదలు వినిపిస్తున్నాయి. రాచకొండ కాకుండా వేరే ప్రాంతాల్లో పెట్టాలన్న ఆలోచనలోనూ సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. రాచకొండతో పాటు వికారాబాద్​, యాదాద్రిలనూ పరిశీలిస్తున్నట్టూ అధికారులు చెబుతున్నారు. రాచకొండ ప్రాంతంలో ఆటోమొబైల్​ ఇండస్ట్రీల ఏర్పాటుకు కొందరు ఇండస్ట్రియలిస్టులు ప్రభుత్వానికి ప్రతిపాదించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిల్మ్​ సిటీ రాచకొండలో కాకపోతే.. ఫస్ట్​ ఆప్షన్​గా వికారాబాద్​వైపు చూస్తున్నట్టు చెబుతున్నారు. అక్కడి అటవీ ప్రాంతానికి సమీపంలో ప్రభుత్వానికి వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడం, తరచూ అక్కడ షూటింగ్​లు జరుగుతుండడంతో ఫిల్మ్​సిటీ ఏర్పాటుకు ఆ ప్లేస్​ బాగుంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్న చర్చ కూడా నడుస్తోందని అధికారులు అంటున్నారు. యాదాద్రి టెంపుల్​ను భారీ హంగులతో పునర్నిర్మిస్తున్న నేపథ్యంలో.. అక్కడ కూడా ఫిల్మ్​ సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అంశమూ పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు.

For More News..

జడ్పీటీసీ వేధిస్తున్నడని సూసైడ్ అటెంప్ట్

మాట వింటలేడని కలెక్టర్​‌ను ట్రాన్స్‌ఫర్ చేయించిన్రు

ధరణి పోర్టల్ పాత దానికే పైపై పూతలు