ఇండియాలో లిక్కర్ తాగే టాప్ 10 రాష్ట్రాలు ఇవే.. తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందంటే...

ఇండియాలో లిక్కర్ తాగే టాప్ 10 రాష్ట్రాలు ఇవే.. తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందంటే...

భారతదేశంలో దాదాపు 16కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. ఇందులో ఇందులో 6 కోట్ల మంది మద్యానికి బానిసలుగా మారారని ఓ నివేదిక ద్వారా  తెలుస్తుంది.  నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మద్యం సేవించే వారిలో . పురుషులు .. స్త్రీలు కూడా ఉన్నారు.  వీరి వయస్సు 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంటుందని నివేదికద్వారా తెలుస్తుంది.   తెలంగాణ రెండో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో అరుణాచల్​ ప్రదేశ్​.. పదో స్థానంలో మేఘాలయ ఉంది. 

 NFHS (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-) నివేదిక  ప్రకారం  ..మద్యం సేవించే 10 రాష్ట్రాలైన అరుణాచల్​ ప్రదేశ్​, తెలంగాణ ,సిక్కిం, గోవా, మణిపూర్​, జార్ఖండ్​, ఛత్తీస్​ ఘడ్​, త్రిపుర, హిమాచల్​ ప్రదేశ్​, మేఘాలయ రాష్ట్రాలు మద్యంసేవించే రాష్ట్రాలుగా టాప్​ టెన్​ జాబితాలో ఉన్నాయి. 

 అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాలపై జరిగిన సర్వే నివేదికల ప్రకారం.. 

అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో అరుణాచల్​ ప్రదేశ్​  పేరు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 52.7 శాతం మంది పురుషులు.. 24.2 శాతం మంది స్త్రీలు  మద్యం సేవిస్తున్నారు.  ఈ  జాబితాలో రెండో స్థానంలో తెలంగాణ ఉంది.   43.3  శాతం మంది పురుషులు.. 6.7 శాతం మంది స్త్రీలు  మద్యం సేవిస్తున్నారు.  వీరిలో 13.7 శాతం మంది నిత్యం మద్యం సేవిస్తున్నారు.

మూడో స్థానంలో ఉన్న సిక్కింలో 39.8  శాతం మంది పురుషులు.. 16.2  శాతం మంది స్త్రీలు  మద్యం సేవిస్తున్నారు. NFHS విడుదల చేసిన  ఈ జాబితాలో నాలుగో స్థానంలో గోవా  ఉంది. 36.9  శాతం మంది పురుషులు.. 5.5 శాతం మంది స్త్రీలు  మద్యం సేవిస్తున్నారు. . వీరిలో నిత్యం తాగేవారి సంఖ్య 6 శాతం మంది ఉన్నారు. 

5వ స్థానంలో మణిపూర్​ ఉంది. ఇక్కడి జనాభాలో 37.5  శాతం మంది పురుషులు.. 0.9 శాతం మంది స్త్రీలు  మద్యం సేవిస్తున్నారు. ఇక జార్ఖండ్​  ఆరో స్థానంలో ఉన్న జనాభాలో దాదాపు 35శాతం మంది పురుషులు.. 6.1 శాతం మంది స్త్రీలు  మద్యం సేవిస్తున్నారు. . ఛత్తీస్​ ఘడ్​ రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. 34.8   శాతం మంది పురుషులు.. 5  శాతం మంది స్త్రీలు  మద్యం సేవిస్తున్నారని  నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే(NFHS) నివేదిక తెలిపింది.

ఇక 8వ స్థానంలో  ఉన్న త్రిపురలో పురుషులు 33.1 శాతం మంది.. స్త్రీలు 6.2 శాతం మంది లిక్కర్​ తాగుతున్నారని ఓ నివేదిక ద్వారా తెలుస్తుంది.  తొమ్మిదవ స్థానంలో హిమాచల్​ ప్రదేశ్​ 31.9  శాతం మంది పురుషులు.. 6.2 శాతం మంది స్త్రీలు  మద్యం సేవిస్తున్నారు.  మేఘాలయలో  దాదాపు 10 శాతం మంది మద్యం సేవిస్తున్నారు.32.4  శాతం మంది పురుషులు.. 1.5 శాతం మంది స్త్రీలు  మద్యం సేవిస్తున్నారు.