ప్రపంచమంతా లాక్ డౌన్ వైపు.. 3 నెలల తర్వాత బతికుంటారనే గ్యారెంటీ ఎంటీ.?

ప్రపంచమంతా లాక్ డౌన్ వైపు.. 3 నెలల తర్వాత బతికుంటారనే గ్యారెంటీ ఎంటీ.?

కరోనా నియంత్రణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అసహనం వ్యక్తం చేశాడు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా సహకరించాలని తన యూట్యూబ్ ఛానల్ లో కోరాడు. అధికారుల సూచనలను,ఆదేశాలను పాటించి కరోనాను నియంత్రించాలన్నారు. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని..ప్రపంచమంతా లాక్ డౌన్ దిశగా వెళ్తుందన్నారు. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోకుండా సమావేశమై,గుంపులుగా ఉండి.. వైరస్ ను నియంత్రించలేమన్నారు.

లాక్ డౌన్ ప్రాంతాల్లో చాలా మంది వస్తువులను నిల్వ చేస్తున్నారని సీరియస్ అయ్యాడు.  బయట దుకాణాలు మూసివేశారు. ఇలాంటి సమయంలో ప్రతి రోజూ కూలీ  పని చేసుకునే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు.  మూడు నెలల తర్వాత మీరు బతికుంటారనే నమ్మకమేంటి? అందరు యూనిటీగా ఉండాలన్నారు..ఒక్కసారి సామాన్యుల గురించి కూడా ఆలోచించాలన్నారు. డబ్బున్నవాళ్లు ఎలాగైనా జీవిస్తారు..కానీ పేదవాడు తన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడన్నారు. హిందూ,ముస్లీం కాదు ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నారు. వస్తువులను నిల్వ చేయడం ఆపాలన్నారు. ఇది ఒకరినొకరు సహాయపడే సమమన్నారు. పాకిస్తాన్ లో ఇప్పటి వరకు 799 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏడుగురు చనిపోయారు.