మూత్రం పసుపు రంగులోకి ఎందుకు వస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు

మూత్రం పసుపు రంగులోకి ఎందుకు వస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు

సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో రోజువారి జరిగే కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోరు. చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో మూత్రం పసుపు రంగులో రావడం లాంటి విషయం  ఒకటి .. ఏదైనా అనారోగ్యం కలిగి వైద్యుడి దగ్గరకు వెళ్తే  మూత్రం ఏ రంగులో ఎందుకు వస్తుంది అని అడిగితే సమాధానం చెప్పలేక అందరూ తెల్ల మొహం వేస్తూ ఉంటారు. ఇంకొంతమంది కాస్త తెలివిగా శరీరంలో నీటి శాతం తక్కువైన లేదంటే వేడి చేసిన కూడా ఇలా మూత్రం పసుపు రంగులో వస్తుంది అని చెబుతూ ఉంటారు.

 యూరిన్ పసుపు రంగులో రావడానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుపుకోవడానికి మేరీ ల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు  పరిశోధనలు జరిపారు.    మూత్రం పసుపుపచ్చ రంగులో ఉండడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని  శాస్త్రవేత్తలు గుర్తించారు . దీనికి సంబంధించి నేచర్ మైక్రోబయాలజీ జర్నల్ లో ఒక కథనం కూడా ప్రచురితమైంది. సాధారణంగా మూత్రంలో నీరు ఎలక్ట్రోలైట్లు మూత్రపిండాలు వడబోసిన రక్తంలోని వ్యర్ధాలు ఉంటాయి.

యూరిన్​  పసుపు పచ్చ రంగులో ఉండడానికి యూరోబీలన్ అనే ఎంజైయ్  కారణమట. దాదాపు 125 ఏళ్ల క్రితమే పరిశోధనలో దీనిని గుర్తించారు. మూత్రం పసుపు రంగులో ఉండడానికి ఎర్ర రక్త కణాలకు సంబంధం ఉంటుందని.. ఇటీవల జరిపిన పరిశోధనలో తేలింది. ఎర్ర రక్త కణాలు విచిన్నమైన తర్వాత బిలీరూబీన్ అనే నారింజ రంగూ వర్ణ ద్రవాన్ని విడుదల చేస్తాయట. ఇక ఇది జీర్ణాశయంలోకి చేరుకున్న తర్వాత ఉపయోగకరమైన బ్యాక్టీరియా దీనిని వివిధ వివిధ అణువులుగా మారుస్తుందట. ఈ క్రమంలోనే యూరోబిలినోజెన్  అనే రంగులేని ఒక ఉప ఉత్పత్తి  తయారై అది క్రమంగా పసుపు పచ్చ రంగులో ఉండే యూరోబిలిన్ గా మారి మూత్రం ద్వారా బయటికి వస్తుందట. ఇటీవల జరిగిన అధ్యయనంలో బయటపడిన విషయాలతో జీర్ణాశయ వ్యాధులకు సంబంధించిన మరిన్ని అంశాలపై స్టడీ చేసేందుకు అవకాశం కలిగిందని పరిశోధకులు చెబుతూ ఉండడం గమనార్హం.

మూత్రం  రంగు మారే ప్రక్రియలో  బిలిరుబిన్ రిడక్టేజ్ ప్రమేయానికి సంబంధించిన వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై మన అవగాహనకు ప్రోత్సాహకరమైన చిక్కులు ఉన్నాయి. పరిశోధకుల ప్రకారం, కామెర్లు,  ప్రేగు వ్యాధి , గట్ ఆరోగ్యంపై వెలుగునిస్తుంది.  ప్రేగు వ్యాధి ఉన్న వ్యక్తులలో బిలిరుబిన్ రిడక్టేజ్ వంటి ఎంజైమ్‌లు ఉండవు, అయితే ఈ ఎంజైమ్‌లు దాదాపు అన్ని ఆరోగ్యకరమైన పెద్దలలో ఉంటాయి. NIH సహ రచయిత జియాఫాంగ్ జియాంగ్ ఈ ఎంజైమ్ పాత్రను నిర్ణయించడం వలన బిలిరుబిన్ స్థాయిలపై గట్ ఫ్లోరా యొక్క ప్రభావాలు మరియు కామెర్లు వంటి సంబంధిత వ్యాధులపై తదుపరి పరిశోధనలకు దారితీయవచ్చని చెప్పడం ద్వారా ఈ అన్వేషణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.


ఎర్ర రక్త కణాలు తమ ఆరు నెలల జీవితకాలం తర్వాత క్షీణించినప్పుడు.. బిలిరుబిన్ అనే నారింజ వర్ణద్రవ్యం ఒక బైప్రోడక్ట్‌గా ఉత్పత్తి అవుతుంది. గట్ బ్యాక్టీరియాలోని ‘ఫ్లోరా’ ఆ బిరుబిలిన్‌ని అణువుగా మార్చగలదు. దానికి ఆక్సిజన్ అందితే.. అది పసుపు రంగులోకి మారుతుంది. ఈ అణువు , యూరోబిలిన్‌లే.. మూత్రం పసుపు రంగులోకి మారడానికి ప్రధాన కారణం’’ అని బ్రాంట్లీ హాల్ చెప్పుకొచ్చారు. కాగా.. ఇదే అధ్యయనం ఈ ప్రతిచర్యకు కారణమయ్యే ఎంజైమ్ గురించి కీలక వివరాలు వెల్లడించింది. ఈ ఎంజైమ్ పెద్ద ప్రేగులలోని ఫర్మిక్యూట్స్ & ఇతర గట్ బ్యాక్టీరియా సహాయంతో యూరోబిలినోజెన్‌గా విచ్ఛిన్నమవుతుంది. అనంతరం గాలి సమక్షంలో అది యూరోబిలిన్‌గా మారుతుందని బ్రాంట్లీ బృందం కనుగొంది.