కాంగ్రెస్పై కర్నాటక హోం మంత్రి మండిపాటు
బెంగళూరు: మైసూర్ లో మెడికల్ స్టూడెంట్పై గ్యాంగ్రేప్ ఘటనను కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తోందని కర్నాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఆరోపించారు. ఘటన మైసూరులో జరిగితే కాంగ్రెస్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందన్నారు. ‘మైసూర్లో అత్యాచారం జరిగింది. కానీ, కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే తనపై రేప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లున్నది. ఇలాంటి ఘటన జరిగినప్పుడు మానవతా కోణంలో ఆలోచించాలె. నిందితులను గుర్తించాలని డిమాండ్ చేయాలె. అంతేగానీ, రాజకీయం చేయడం పద్ధతి కాదు’ అని గురువారం మీడియాతో అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా, మంగళవారం మైసూరు శివారులో జరిగిన మెడికల్ స్టూడెంట్గ్యాంగ్ రేప్ ఘటనపై జ్ఞానేంద్ర వివాదాస్పద కామెంట్లు చేశారు. స్నేహితుడితో కలిసి ఈ మెడికల్ స్టూడెంట్ రాత్రి 7 గంటలకు వెళ్లడమేంటన్నారు. ఆ సమయంలో అక్కడేం పని అంటూ బాధితురాలిని కించపరిచేలా కామెంట్ చేశారు. ఈ కామెంట్స్పై కాంగ్రెస్ మండిపడింది.