టిక్ టాక్ లో ఫాలోయింగ్ పెరగడంతో భార్యను చంపేశాడు

టిక్ టాక్ లో ఫాలోయింగ్ పెరగడంతో భార్యను చంపేశాడు

ఈ మధ్య సోషల్ మీడియా వ్యక్తులపై చాలా ప్రభావం చూపుతోంది. ఎంతగా అంటే ఒక్కోసారి అది మనుషుల ప్రాణాలను తీస్తుంది. ఈ మధ్య పబ్ జీ గేమ్, టిక్ టాక్ ఎంత ఫేమసో అందరికీ తెలుసు. వీటికి అడిక్ట్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. పబ్ జీ గేమ్ కు బానిసై ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఈ లిస్టులో ఇపుడు టిక్ టాక్ వచ్చింది. టిక్ టాక్ వీడియోలకు అడిక్ట్ అయ్యిందని భార్యను హత్య చేశాడు ఓ  భర్త. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం..తమిళనాడులో కొవై ప్రాంతానికి చెందిన  కనకరాజు , నందిని అనే దంపతులు ఉన్నారు. కనకరాజు మేస్త్రీగా, నందిని ఓ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తుంది. వీరికి ఓ కొడుకు,కూతురు ఉన్నారు. గొడవల కారణంగా దంపతులిద్దరు కొన్ని రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. టిక్ టాక్ కు అడిక్ట్ అయిన నందిని రోజు విచ్చలవిడిగా టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేసేది.

ఈ విషయం తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న భర్త కనకరాజు  ఆమె కు ఫోన్ చేసి టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేయొద్దని చెప్పాడు. ఆమె వీడియోలకు క్రేజ్ పెరగడం.. ఫాలోయర్లు పెరగడంతో… కనకరాజు కోపంతో రగిలిపోయాడు. మద్యం తాగి భార్య పని చేస్తున్న కాలేజీకి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. అదే మత్తులో ఆమెను కత్తితో పొడిచి పారిపోయాడు. అక్కడిక్కడే ఆమె మృతి చెందింది.