బ్యూటీపార్లర్ వద్దన్నందుకు భార్య ఆత్మహత్య

బ్యూటీపార్లర్ వద్దన్నందుకు  భార్య ఆత్మహత్య

మానవపాడు, వెలుగు : బ్యూటీపార్లర్ పెడదామని భార్య అడగ్గా తర్వాత చూద్దాం అన్నందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ చంద్రకాంత్  కథనం ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయికి చెందిన లచ్చాగౌడ్  కూతురు ఇంద్రజ(28)ను ఆరేండ్ల కింద గట్టు మండలం తప్పెట్ల మోర్స్  గ్రామానికి చెందిన గోవర్ధన్ గౌడ్ కు ఇచ్చి పెండ్లి చేశారు. ఈ నెల 6న ఇంద్రజ తల్లి గారింటికి రాగా, తీసుకెళ్లేందుకు శనివారం గోవర్ధన్​గౌడ్ ​వచ్చాడు. తాను బ్యూటీపార్లర్  కోర్సు పూర్తి చేశానని షాపు పెడదామని అడిగింది. ‘తర్వాత పెడదాం..ఇప్పుడు వద్దు’ అనడంతో మనస్తాపానికి గురై బాత్​రూంలోకి వెళ్లి పురుగులమందు తాగింది. కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలిస్తుండగా, చనిపోయింది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లున్నారు.