భర్త మృతిని తట్టుకోలేక భార్య సూసైడ్

భర్త మృతిని తట్టుకోలేక భార్య సూసైడ్

సికింద్రాబాద్, వెలుగు: భర్త మృతిని తట్టుకోలేక భార్య సూసైడ్ ​చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లోని అంబర్​పేటలో గురువారం చోటు చేసుకుంది. అంబర్​పేట్​లోని డీడీ కాలనీకి చెందిన సాహితి(29)కి ఏడాదిన్నర కిందట వనస్థలిపురానికి చెందిన మనోజ్ అనే సాఫ్ట్​వేర్​ఇంజినీర్​తో పెండ్లి జరిగింది. వివాహం తర్వాత భార్యాభర్తలిద్దరూ అమెరికాలోని డల్లాస్​కు వెళ్లి ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 2న సాహితి డీడీ కాలనీలో ఉండే తన తల్లిదండ్రులను చూడటానికి వచ్చింది. 20వ తేదీన సాహితి భర్త మనోజ్ డల్లాస్​లో హార్ట్​ఎటాక్​తో చనిపోయాడు.

అతని డెడ్​బాడీని ఈ నెల 23న సిటీకి తీసుకొచ్చి 24న వనస్థలిపురంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. భర్త మృతితో తీవ్ర వేదనకు గురైన సాహితిని క్షణం కూడా వదలకుండా ఆమె చెల్లెలు సంజన చూసుకుంటున్నది. గురువారం ఉదయం సంజన వాష్ రూమ్ కు​ వెళ్లి వచ్చేసరికే సాహిత చీరతో ఫ్యాన్​కు ఉరివేసుకుని సూసైడ్​చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికిచేరుకుని డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రోజుల వ్యవధిలో భార్యభర్తలు చనిపోవటం పట్ల బంధువులంతా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.