సికింద్రాబాద్, వెలుగు: భర్త మృతిని తట్టుకోలేక భార్య సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని అంబర్పేటలో గురువారం చోటు చేసుకుంది. అంబర్పేట్లోని డీడీ కాలనీకి చెందిన సాహితి(29)కి ఏడాదిన్నర కిందట వనస్థలిపురానికి చెందిన మనోజ్ అనే సాఫ్ట్వేర్ఇంజినీర్తో పెండ్లి జరిగింది. వివాహం తర్వాత భార్యాభర్తలిద్దరూ అమెరికాలోని డల్లాస్కు వెళ్లి ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 2న సాహితి డీడీ కాలనీలో ఉండే తన తల్లిదండ్రులను చూడటానికి వచ్చింది. 20వ తేదీన సాహితి భర్త మనోజ్ డల్లాస్లో హార్ట్ఎటాక్తో చనిపోయాడు.
అతని డెడ్బాడీని ఈ నెల 23న సిటీకి తీసుకొచ్చి 24న వనస్థలిపురంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. భర్త మృతితో తీవ్ర వేదనకు గురైన సాహితిని క్షణం కూడా వదలకుండా ఆమె చెల్లెలు సంజన చూసుకుంటున్నది. గురువారం ఉదయం సంజన వాష్ రూమ్ కు వెళ్లి వచ్చేసరికే సాహిత చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికిచేరుకుని డెడ్బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రోజుల వ్యవధిలో భార్యభర్తలు చనిపోవటం పట్ల బంధువులంతా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.