మంత్రి ఇన్విటేషన్​ కోసమే వెయిట్​ చేస్తున్నా : రఘునందన్ రావు   

మంత్రి ఇన్విటేషన్​ కోసమే వెయిట్​ చేస్తున్నా : రఘునందన్ రావు   

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డిపై తాను చేసిన ఆరోపణలను తప్పకుండా నిరూపిస్తానని, ఆయన టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రఘునందన్​ రావు అన్నారు. ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద రఘనందన్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రి ప్రెస్ మీట్ చూశా. ఈనెల 27, 28న పిలుస్తానని అన్నారు. ఆయన ఇన్విటేషన్ కోసం వెయిట్ చేస్తున్నా” అని రఘునందన్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెస్తం కర్నాటక ఎన్నికల తర్వాత అమిత్ షా తీసుకునే నిర్ణ యాలు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెస్తాయని ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

ఇక్కడి పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని, అమిత్ షా వేసే ప్రతి అడుగు రాష్ర్టంలో పార్టీని బలో పేతం చేస్తోందన్నారు. ‘‘జనం ట్యాక్సులు కడితేనే రాష్ర్టానికి , కేంద్రానికి నిధులు వస్తున్నాయి. అంతేతప్ప కేసీఆర్ ఫాం హౌజ్ నుంచి లేదంటే అమెరికాలో కేటీఆర్, హరీశ్ రావు జీతం చేసి నిధులు తీసుకురావటం లేదు” అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ర్టానికి రెవెన్యూ లో అధిక శాతం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచే వస్తుందన్నారు.