బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.2024 లోక్ సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఏడెనిమిది మంది బీజేపీ నేతలు టీఎంసీలో చేరాలనుకుంటున్నారని ఈ విషయాన్ని తనకు స్వయంగా చెప్పారన్నారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారిని తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. కార్మికులు, రైతులు, సామాన్యులకు ఏమీ ప్రతిపాదించలేదని చెప్పారు. ఏజెన్సీలతో కాకుండా ప్రజలతో కలిసి పనిచేయాలని టీఎంసీ భావిస్తోందన్నారు. తొలి కార్యవర్గ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహిస్తామని చెప్పారు మమతా బెనర్జీ. అధికారం కోసం బీజేపీ ఈడీ, సీబీఐ, నగదు అనే మూడు ఆభరణాలను ఉపయోగించుకుంటుందని ఆరోపించారు మమతా బెనర్జీ.
మరిన్ని వార్తల కోసం