సీఎం అభ్యర్థిపై ప్రజల అభిప్రాయమే ఫైనల్

సీఎం అభ్యర్థిపై ప్రజల అభిప్రాయమే ఫైనల్

పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది. అందుకే ఐవీఆర్ కాల్స్ తరహాలో ప్రజల అభిప్రాయాన్ని కోరుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో మూడు ఆప్షన్లు ఉన్నాయి. సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ పేరు మొదటి స్థానంలో నిలవగా..రెండో స్థానంలో నవజ్యోత్ సిద్ధూ..మూడో ఆప్షన్ లో కాంగ్రెస్ కు సీఎం అభ్యర్థి లేకుండా బరిలో దిగాలని కోరుతున్నారు. అంతకు ముందే ఆమ్ ఆద్మీ నిర్వహించిన సీఎం అభ్యర్థి ఎంపిక సర్వే అంతా భోగస్ అని కొట్టిపారేశారు సిద్ధూ. సర్వే మొత్తం ఒక స్కామ్ గా అభివర్ణించారు. 

మరిన్ని వార్తల కోసం

ఎయిరిండియా ప్రయాణికులకు రతన్ టాటా స్పెషల్ మెసేజ్

ప్రపంచం బలమైన భారత్ను చూడాలనుకుంటోంది