చంద్రబాబు ఓడిపోవాలన్న కోరిక నెరవేరింది: మోత్కుపల్లి

చంద్రబాబు ఓడిపోవాలన్న కోరిక నెరవేరింది: మోత్కుపల్లి

2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పరాజయం ఎంతో ఆనందం కలిగించిందన్నారు టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు. చంద్రబాబు రాజకీయంగా ఓడిపోవాలన్న నా కోరిక వెంకన్న నెరవేర్చడంతో స్వామి వారి మొక్కు తీర్చుకోవడానికి తిరుమల వచ్చానన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోత్కుపల్లి.. అధికారం కోసం కుట్రలు చేసిన బాబును ఏపీ ప్రజలు తరిమికొట్టారన్నారు. చంద్రబాబు ప్రజా ద్రోహి.. ఆయన వల్ల ఎవరికీ  లాభం లేదన్నారు. టీడీపీ జెండాను నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా, తెలంగాణాలలో ఉన్న దళితులకు న్యాయం జరగాలన్నదే తన కోరికన్నారు. తాను ఇక్కడ ఎమ్మెల్యేగానో,ఎంపీగానో పోటీ చేయలేదన్నారు.

నమ్మకానికి వైఎస్ కుటుంబం మారు పేరన్న మోత్కపల్లి…YSR ను నమ్ముకుంటే ప్రాణం ఇస్తారు, చంద్రబాబును నమ్ముకుంటే ప్రాణం తీస్తారన్నారు.  పేద బిడ్డల ముఖ్యమంత్రిగా జగన్ ముందుకు సాగాలని..ఆయన పాలనలో ప్రజలు హాయిగా ఉంటారని చెప్పారు. తెలంగాణలో ఎలాగో టీడీపీ లేదు.. ఇక ఏపీలో కూడా టీడీపీ అంతమైపోతుందని జోస్యం చెప్పారు. నాలుగేళ్ళు కలిసుండి ప్రధాని మోడీని కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని..ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే పదవులు కేటాయిస్తారని ఆరోపించారు మోత్కుపల్లి.