రెండేళ్ల మేనల్లుడిని చంపి డ్రైనేజీలో పడేసిన మేనత్త

రెండేళ్ల మేనల్లుడిని చంపి డ్రైనేజీలో పడేసిన మేనత్త

ఢిల్లీలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని పసిపిల్లాడిని చంపి.. మురికి కాలువలో పడేసింది ఓ మేనత్త. ఖ్యాలాలోని రఘుబీర్ నగర్‌ మురికివాడ క్లస్టర్‌లో యమున, ఆమె భర్త రాజష్ నివసిస్తున్నారు. వీరిద్దరూ.. వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. అయితే యమునకు ఒక అన్న ఉన్నాడు. అతనికి పుట్టిన రెండెళ్ల పిల్లాడంటే.. యమున తల్లికి చాలా ఇష్టం. దాంతో యమున తల్లి.. పిల్లా ఎంతో ప్రేమగా చూసుకునేది. అది చూసిన యమున.. పిల్లాడిపై అసూయతో కోపం పెంచుకుంది. దాంతో పంజాబీ బాగ్ ప్రాంతంలో తల్లిదండ్రులతో ఉండే పిల్లాడిని కిడ్నాప్ చేసింది. అనంతరం భర్త రాజేష్ సాయంతో.. పిల్లాడిని హత్యచేసింది. బాలుడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. దట్టమైన బురద, ఫ్లోటింగ్ ఉన్న నాలాలో పడేసింది. బాలుడు కనిపించకపోయేసరికి అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో బాలుడిని యమున తీసుకెళ్లడం చూశారు. దాంతో యమునను అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది. యమున చెప్పిన వివరాల ప్రకారం.. బాలుడి మృతదేహాన్ని వెలికి తీయడానికి 89 మంది పౌరులు మరియు వరద విభాగానికి చెందిన 32 మంది కార్మికులతో సహా దాదాపు 150 మంది సాయం చేశారు. దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం వారిద్దరినీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.