డెలివరీ తర్వాత అతుక్కోని కుట్లు.. బాధ భరించలేక సూసైడ్

డెలివరీ తర్వాత అతుక్కోని కుట్లు.. బాధ భరించలేక సూసైడ్

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలింత బాత్ రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కమాన్ పూర్ మండలం రొంపి కుంటకు చెందిన గుమ్మడి ఉమాకు ఈ నెల 12న సిజేరియన్ చేశారు డాక్టర్లు. అయితే సర్జరీ చేసినప్పుడు కుట్లు అతుక్కొలేదు. మూడు సార్లు సర్జరీ చేసిన కుట్లు అతుక్కోలేదు. దీంతో నొప్పిని భరించలేకపోయిన మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా వ్యవహరించారని...కుట్లు సరిగ్గా వేయలేదని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.