
చందానగర్ పీఎస్ పరిధిలో ఉరేసుకుని చనిపోయిన మహిళ
చందానగర్,వెలుగు: వ్యాధి తగ్గడం లేదని మానసిక ఆందోళనతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన జి. వెంకటేశ్వర్రెడ్డి భార్య సులోచన(38) 2015 నుంచి బ్రెస్ట్ క్యాన్సర్తో భాదపడుతోంది. చందానగర్ బాపునగర్లోని సాయిసూర్య రెసిడెన్సీలో నివాసం ఉంటున్న తన పిన్నీ లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి నిమ్స్హాస్పిటల్ లో కొన్ని రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. హాస్పిటల్ డాక్టర్లు ఈ నెల 17న సులోచనకు సర్జరీ చేయాలనుకున్నారు. తనకు వచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేస్తే తగ్గుతుందో లేదో అని మానసికంగా ఆందోళన చెందిన సులోచన బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె పిన్నీ లక్ష్మీదేవి గమనించి సులోచనను స్థానికుల సాయంతో ప్రైవేటు హాస్పిటల్ కి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో సులోచన తల్లి నారాయణమ్మ చందానగర్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపారు.