చెప్పుల దండేసి ఊరేగింపు.. సర్పంచ్‌కు పోలీసుల వార్నింగ్

చెప్పుల దండేసి ఊరేగింపు.. సర్పంచ్‌కు పోలీసుల వార్నింగ్

హైదరాబాద్‌ : ఇంటర్ చేస్తున్న బాలుడితో ఇద్దరు పిల్లలున్న మహిళ క్లోజ్ గా ఉంటుందని దారుణంగా శిక్షించారు గ్రామస్థులు. వారిద్దరికి వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో ఆ బాలుడిని చితకబాదారు. అంతేకాదు బాలుడికి, వివాహితకు చెప్పుల దండలువేసి ఊరేగించారు. రెండు రోజుల్లో ఊరి నుంచి బహిష్కరించాలని సర్పంచ్ తీర్మాణం చేశారు. హర్యానాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ అమానవీయ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వివరాలు :   హర్యానాలోని దనియాల్‌ పూర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ కర్నాల్‌ లో నివసిస్తోంది. ఈమెకు ఇద్దరు పిల్లలు. భర్త ట్రాన్స్‌జెండర్‌. ఈ క్రమంలో 12వ తరగతితో చదువుతున్న ఓ కుర్రాడితో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని మహిళ కమ్యూనిటీకి చెందిన బంజారా కులస్తులు పంచాయతీ పెట్టారు. అబ్బాయిది బల్మీకీ కమ్యూనిటీ. కాగా, సర్పంచ్‌ నిర్ణయం మేరకు వారిద్దరినీ ఊరి నుంచి పంపించాలని నిర్ణయించారు. పంచాయతీ అయిపోయిన తర్వాత కొంతమంది బంజారాలు కలిసి బాలుడికి, వివాహితకు చెప్పలు దండేసి గ్రామంలో ఊరేగించారు. బాలుడిని తీవ్రంగా కొట్టారు.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించారు. ఆ గ్రామానికి వెళ్లి, సర్పంచ్ కు వార్నింగ్ ఇచ్చారు. బాలుడిని.. హస్పిటల్ లో అడ్మిట్ చేశారు.   ఈ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. అయితే ఆ బాలుడు తనకు తమ్ముడిలాంటివాడని పోలీసులకు తెలిపిన మహిళ..అన్యాయంగా తనకు అక్రమ సంబంధం అంటగట్టారని కన్నీరుమున్నీరయ్యింది.