మహిళను చంపి.. డెడ్బాడీకి కాళ్లు, చేతులు కట్టేసి, ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో కుక్కి గుర్తు తెలియని దుండగులు డ్రైనేజీలో పడేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మన్ఖుర్డ్ ఏరియాలో ఆ డెడ్బాడీని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
మన్ఖుర్ద్ ఏరియాలోని జకీర్ హుస్సేన్ నగర్లో కొంత మంది లోకల్స్ ఆదివారం ఉదయం డ్రైనేజీలో ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ పడి ఉండడాన్ని లోకల్స్ గుర్తించారు. దాని చుట్టూ కుక్కలు చేరి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు ఆ బ్యాగ్ను బయటకు తీసి ఓపెన్ చేశారు. అందులో సుమారు 25 నుంచి 30 ఏండ్ల మధ్య వయసున్న మహిళ డెడ్బాడీ ఉందని, కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆమె మెడలో తాళి ఉందని, అలాగే ఒంటిపై ఇతర బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ఏరియా చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. సిటీలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా మిస్సింగ్ కంప్లైంట్ ఉన్నాయా అన్నది కూడా చెక్ చేస్తున్నామని చెప్పారు. ఈ మహిళను అత్తింటి వాళ్లు హత్య చేసి అక్కడ పడేశారా? లేక ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి చంపారా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అయితే ముందుగా ఆమె ఐడెంటిటీని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.