జూబ్లీహిల్స్ లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్..మంటలు అంటుకొని మహిళ మృతి

జూబ్లీహిల్స్ లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్..మంటలు అంటుకొని మహిళ మృతి

జూబ్లీహిల్స్, వెలుగు: వంట చేస్తుండగా గ్యాస్  లీకై మంటలు అంటుకోవడంతో ఓ మహిళ మృతి చెందింది. రెహమత్ నగర్ కమాన్ గల్లీలో నివాసముండే సోను(40) ఆదివారం ఇంట్లో వంట చేస్తోంది. ఆ సమయంలో ఒక్కసారిగా  రెగ్యులేటర్  నుంచి గ్యాస్​ లీకై ఆమెకు మంటలు చెలరేగాయి. 

ఆ మంటల్లో చిక్కుకుని సోను మృతిచెందింది. పక్కనే ఉన్న తల్లిదండ్రులు గోపాల్​సింగ్​, లలితాసింగ్​కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఫైర్ సేఫ్టీ అధికారులు  అక్కడికి చేరుకుని సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆర్పి వేశారు.