
- తీవ్ర అస్వస్థత గురై చికిత్స పొందుతూ మృతి
- హనుమకొండ జిల్లా కొప్పుల గ్రామంలో ఘటన
శాయంపేట, వెలుగు: భార్యపై అనుమానంతో భర్త కొట్టడడంతో పాటు ఇంజక్షన్ చేయడంతో సీరియస్ అయి చికిత్స పొందుతూ చనిపోయిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. శాయంపేట సీఐ రంజిత్రావు తెలిపిన ప్రకారం.. శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ అబ్బోజు రాజాచారి, హేమలత(35) దంపతులు. కాగా అనుమానంతో భార్యను అతను కొడుతుండేవాడు. గత శుక్రవారం కూడా ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో ఆమె అస్వస్థతకు గురైంది. భార్యకు రాజాచారి గ్లూకోజ్ఎక్కించి అందులో ఏదో ఇంజక్షన్ వేశాడు.
దీంతో హేమలత తీవ్ర అస్వస్థతకు గురవగా.. కుటుంబ సభ్యులు పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల సూచనతో వరంగల్ ఎంజీఎంకు అటునుంచి ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి హేమలత చనిపోయింది. తన తల్లి చావుకు కారణం తండ్రి రాజాచారి ఇచ్చిన ఇంజక్షనే అని పెద్ద కుమార్తె గాదే శివాని ఆదివారం ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రంజిత్తెలిపారు.