దారుణం.. 19 ఏళ్ల మహిళపై 9 రోజులు గ్యాంగ్‌రేప్

దారుణం.. 19 ఏళ్ల మహిళపై 9 రోజులు గ్యాంగ్‌రేప్

హర్యానాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాట్లాడుదామని గుడికి పిలిచి.. ఎత్తుకెళ్లి తొమ్మిది రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుష సంఘటన గుర్గావ్ జిల్లాలోని సోహ్నా పట్టణంలో జరిగింది. స్థానికంగా నివసించే మహిళ జూన్ 29న నీళ్లు తీసుకురావడానికి ఊరి చివరకు వెళ్లింది. తిరుగు మార్గంలో చింటు అనే పరిచయస్తుడు ఆమెకు కలిశాడు. నీతో మాట్లాడాలి.. రేపు గుడి దగ్గరకు రమ్మని చింటు.. బాధితురాలిని కోరాడు. దాంతో మరుసటి రోజు బాధితురాలు.. గుడి దగ్గరికి వెళ్లింది. కాసేపటికి అక్కడికి చింటు స్నేహితులు దీపక్, సంజూ కారులో వచ్చారు. అనంతరం వారు ముగ్గురు బాధితురాలిని బలవంతంగా కారులో ఫరీదాబాద్ తీసుకెళ్లారు.

అక్కడ ఆమెకు నిద్రమాత్రలు కలిపిన వాటర్ తాగడానికి ఇచ్చారు. దాంతో బాధితురాలు మత్తులోకి జారుకుంది. కొన్ని గంటల తర్వాత మెలకువలోకి వచ్చిన బాధితురాలికి ఆ గదిలో మందు బాటిళ్లు, సిగరెట్ పీకలు కనిపించాయి. దాంతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురైంది. ఆ తర్వాత మరుసటి రోజు బాధితురాలి పక్క గ్రామానికి చెందిని కుల్దీప్ అనే వ్యక్తి అక్కడకు వచ్చాడు. అనంతరం నలుగురు కలిసి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ విధంగా ప్రతిరోజూ మత్తుమందు ఇస్తూ.. తొమ్మిది రోజులపాటు బాధితురాలికి నరకం చూపించారు. నిందితులు ఘటనను మొత్తం వీడియో తీశారు. ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతామని హెచ్చరించారు.

కాగా.. బాధితురాలు ఇంటికి రాకపోవడంతో జూన్ 29న ఆమెకు భర్త ఫోన్ చేశాడు. ఆ సమయంలో నిందితులు ఆమెకు గన్ పెట్టి.. తాను స్నేహితుల ఇంట్లో ఉన్నానని.. కొన్ని రోజుల తర్వాత వస్తానని చెప్పమని బెదిరించారు. చివరకు తొమ్మిది రోజుల తర్వాత జూలై 8న బాధితురాలిని బల్లభ్‌ఘర్ బస్టాండ్‌లో విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న బాధితురాలు.. భర్త సాయంతో జూలై 11న సోహ్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై సెక్షన్ 201, 328, 365, 376 డీ మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సోహ్నా స్టేషన్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ తెలిపారు.