కేబుల్ బ్రిడ్జి వద్ద దారుణం

కేబుల్ బ్రిడ్జి వద్ద దారుణం

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద దారుణం జరిగింది. బ్రిడ్జిపై నుంచి ఓ యువతి దుర్గం చెరువులోకి దూకింది. ఇది గమనించిన సందర్శకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన లేక్ పోలీసులు యువతి కోసం స్పీడ్ బోట్స్తో గాలిస్తున్నారు. గజ ఈతగాళ్లు సైతం యువతి ఆచూకీ కోసం శ్రమిస్తున్నారు.

కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకిన యువతిని 23 ఏండ్ల స్వప్నగా గుర్తించారు. యువతి బ్రిడ్జిపై చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ వదలిపెట్టింది. దాన్ని పరిశీలించగా అందులో దొరికిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ను బట్టి స్వప్న కొంతకాలంగా డిప్రెషన్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మానసిక ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్యయత్నం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.